నిజంనిప్పులాంటిది

Aug 18 2023, 15:52

తెలంగాణ ధీరత్వానికి ప్రతీక సర్వాయి పాపన్న గౌడ్‌ : సీఎం కేసీఆర్‌

తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారని సీఎం కేసీఆర్ కొనియాడారు.

సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఆయన కృషిని, పోషించిన చారిత్రక పాత్రను సీఎం స్మరించుకున్నారు.

కుల, మతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం దక్కాలనే సమ సమాజ ప్రజాస్వామిక స్ఫూర్తితో ఆనాటి కాలంలోనే పాపన్నగౌడ్ పోరాడడం గొప్ప విషయమన్నారు.

విశ్వకీర్తిని పొందిన పాపన్న గొప్పతనాన్ని స్మరించుకునేందుకు ప్రతి ఏటా వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహిస్తున్నదని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

తెలంగాణ స్వయం పాలనలో సబ్బండ వర్గాలకు రాజకీయ అధికారంలో భాగస్వామ్యం లభించిందని, స్వరాష్ట్రంలో వేలాది మంది దళిత, బహుజన బిడ్డలను నాయకులుగా తీర్చిదిద్దడం ద్వారా పాపన్నగౌడ్ ఆశయాలను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు....

నిజంనిప్పులాంటిది

Aug 18 2023, 15:50

బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న… మంత్రి గంగుల

గోల్కోండ కోటపై జెండా ఎగరేసిన బహుజన వీరుడు, తెలంగాణ చత్రపతి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.

శుక్రవారం కరీంనగర్ లో సర్వాయి పాపన్న 373వ జన్మదినం సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ…

తెలంగాణ రాక ముందు పోరాట యోధులను, మహానీయులను సమైక్య ప్రభుత్వం విస్మరించిందని, తెలంగాణ ప్రభుత్వం మహనీయుల ఆశయాలను కొనసాగిస్తుందన్నారు. బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన చరిత్ర సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ది అని, ఆయన పోరాట పటిమను పౌరుషాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు..

ఆయన చరిత్రను బాహ్య ప్రపంచానికి తెలిపే విధంగా కార్యక్రమాలు చేపడతామని పునరుద్ఘాటించారు.

300సంవత్సరాల కంటే ముందే బహుజన రాజ్యం కోసం గోల్కొండ కోటను అధిరోహించి గోల్కోండ సింహాసనాన్ని వశపరుచుకున్న బడుగు, బలహీన వర్గాల నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న అని గుర్తు చేశారు.

పాపన్న గౌడ్ ఒక గౌడకులానికే కాకుండా బీసీ సామాజిక వర్గానికి అన్ని కులాలకు సహకరించిన ధీరుడని, పెత్తందారులను ఎదురించి పేద ప్రజలకు అండగా నిలిచి ఆదుకున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ బి గోపి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయి, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి, బారాసా నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, రెడ్డ వేణి మధు కలర్ సత్తన్న, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు......

నిజంనిప్పులాంటిది

Aug 18 2023, 15:49

ప్రజల ఆరోగ్య పరిరక్షణ లో నిర్లక్ష్యం వద్దు..ఎమ్మెల్సీ కవిత సూచన

వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య శాఖ అధికారులను ఎమ్మెల్సీ కవిత కోరారు.

నిజామాబాద్‌ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో పాటు మున్సిపల్‌ కమిషనర్‌తో ఈరోజు ఎమ్మెల్సీ కవిత ఫోన్‌లో మాట్లాడి పలు సూచనలు చేశారు.

నిజామాబాద్‌ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో పాటు మున్సిపల్‌ కమిషనర్‌తో ఎమ్మెల్సీ కవిత ఫోన్‌లో మాట్లాడి పలు సూచనలు చేశారు.

ముఖ్యంగా డెంగీ వ్యాధి ప్రబలకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

ఎప్పటికప్పుడు దోమల నివారణ మందులు పిచికారీ చేస్తూ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.

డెంగీ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సీజనల్‌ వ్యాధుల నివారణ మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఎక్కడా కూడా నిర్లక్ష్యం వహించవద్దని కోరారు...

నిజంనిప్పులాంటిది

Aug 18 2023, 13:12

నేటితో ముగియనున్న మద్యం టెండర్ల గడువు

నేటితో మద్యం టెండర్ల గడువు ముగియనుంది. తెలంగాణలో మొత్తం 2,620 మద్యం షాపులు ఉన్నాయి.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 615 వైన్స్ షాపులు ఉన్నాయి. అయితే అధికారులు మొత్తం లక్ష అప్లికేషన్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.

దరఖాస్తుల ద్వారానే సర్కారుకు రూ.2వేల కోట్లు సమకూరనున్నాయి.

ఎన్నికల వేళ కావడంతో మద్యం షాపులకు భారీగా డిమాండ్ ఏర్పడింది.

తెలంగాణ వ్యాప్తంగా మద్యం షాపుల టెండర్లకు ఫుల్ రెస్పాన్స్ వస్తోంది.

గురువారం వరకు 70 వేల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో దరఖాస్తుకు రూ.2లక్షల ఫీజు వసూలు చేస్తున్నారు...

నిజంనిప్పులాంటిది

Aug 18 2023, 13:11

YS Sharmila: వైఎస్‌ షర్మిల గృహనిర్బంధం.. పోలీసులకు హారతిచ్చి నిరసన..

గజ్వేల్‌: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలో పర్యటించేందుకు వెళ్లాలనుకున్న వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిలను పోలీసులు గృహనిర్బంధం చేశారు..

దళితబంధులో అక్రమాలు జరిగాయంటూ ఇటీవల గజ్వేల్‌లోని జగదేవ్‌పూర్‌ మండలం తీగుల్‌ గ్రామస్థులు ఆందోళన చేశారు. వారికి మద్దతుగా అక్కడ పర్యటించాలని నిర్ణయించుకున్న షర్మిలను అనుమతి లేదంటూ పోలీసులు గృహనిర్బంధం చేశారు.

ఆమె నివాసం లోటస్‌పాండ్‌ వద్ద పోలీసులు మోహరించారు. గజ్వేల్‌ వెళ్లి తీరుతానంటూ పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగగా.. అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు..

దేనికోసం అనుమతి తీసుకోవాలి?

పోలీసులు గృహనిర్బంధం చేయడంపై షర్మిల వినూత్నంగా నిరసన తెలిపారు. గజ్వేల్‌ పర్యటనకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులకు హారతి ఇచ్చారు. డ్యూటీ సరిగా చేయండి సార్‌ అని వ్యాఖ్యానించారు. గజ్వేల్‌లో నిరసన తెలుపుతున్న భారాస నేతలను ఎందుకు అరెస్టు చేయడం లేదని షర్మిల ప్రశ్నించారు.

''పోలీసులు సీఎం కేసీఆర్‌ తొత్తుల్లా పనిచేయడం మానుకోవాలి. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని వదిలి మమ్మల్ని పట్టుకుంటున్నారు. దేనికోసం అనుమతి తీసుకోవాలి? ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాం. ప్రజలను కలవడానికి అనుమతి తీసుకోవాలా? కేసీఆర్‌ నన్ను చూసి భయపడుతున్నారు'' అని షర్మిల అన్నారు.

ఇంటి వద్దే దీక్షకు దిగిన షర్మిల

గజ్వేల్ పర్యటనను అడ్డుకున్నందుకు నిరసనగా లోటస్‌పాండ్‌లోని తన నివాసం వద్ద షర్మిల దీక్షకు దిగారు. సాయంత్రం వరకు దీక్ష కొనసాగిస్తానని ఆమె చెప్పారు.

నిజంనిప్పులాంటిది

Aug 18 2023, 13:09

హైదరాబాద్ లో హైటెక్ వ్యభిచారం

సికింద్రాబాద్‌ అల్వాల్‌లోని వెంకటపురంలో శుక్రవారం ఉదయం పోలీసులు వ్యభిచార ముఠా గట్టురట్టు చేశారు.

వ్యభిచారం చేస్తున్న తొమ్మిది మంది యువతులు, ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

వ్యభిచారం నిర్వహిస్తున్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఎస్‌ఓటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తు్న్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...

SB NEWS

నిజంనిప్పులాంటిది

Aug 18 2023, 13:07

హ్యాట్రిక్ కోసం కేసిఆర్ సర్కార్ ఫోకస్ !

- ఆగస్ట్ 21న అభ్యర్థుల ఎంపికపై జాబితా విడుదల

- నేతల్లో కొనసాగుతున్న టెన్షన్

- సిట్టింగులగే టికెట్ల కేటాయింపుకు మొగ్గు

- ప్రజల్లో ఉండాలని నేతలకు కేసిఆర్ పిలుపు

తెలంగాణలో అసెంబ్లీ అభ్యర్దుల జాబితాలు సిద్దం అవుతున్నాయి. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన సీఎం కేసీఆర్ తొలి జాబితా విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసారు. ఈ నెల 21న దాదాపు 60 మందితో లిస్టు విడుదలకు రంగం సిద్దమైంది. అందులో ఇప్పుడు సిట్టింగ్ లకే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దీంతో, లిస్టులో ఉండేదెవరు.. మారేదెవరనేది ఆసక్తి కరంగా మారింది. కొందరు మంత్రులను లోక్ సభకు పంపాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తొలి జాబితాపై కసరత్తు:

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులపై సుదీర్ఘ కసరత్తు చేసిన కేసీఆర్‌ జాబితాను సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 21న 60 మందికి పైగా పేర్లతో లిస్టు ప్రకటించన్నారు. గెలుపు గుర్రాలకు ప్రాధాన్యతనిస్తూ, ఆచితూచి అభ్యర్థుల ఎంపిక జరిగింది. సిట్టింగ్ లకు తిరిగి సీట్ల ఖరారులో ప్రాధాన్యత ఇస్తున్న సీఎం కేసీఆర్ గెలుపే ప్రామాణికంగా అభ్యర్దులను ఎంపిక చేసినట్లు సమాచారం.

పూర్తైన గ్రౌండ్ సర్వే;

సర్వే నివేదికల ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేస్తున్నారు. 20 మందికిపైన సిట్టింగ్ లకు టికెట్ దక్కదని తెలుస్తోంది. వారికి ఇప్పటికే బుజ్జగింపులు మొదలయ్యాయి. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తే భవిష్యత్తులో ఇతర అవకాశాలు ఇస్తామని కీలక నేతలు నచ్చజెప్తున్నట్టు సమాచారం.

సిట్టింగులకు టికెట్ల కేటాయింపు డౌటే ?

దక్కేదెవరు..మారేదెవరు.. ఇదే సమయంలో టికెట్ దక్కదనే సంకేతాలు అందుకున్న ఎమ్మెల్యేలు కేడర్‌తో భేటీలు జరుపుతూ బలప్రదర్శన ద్వారా అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలు, 2018లో కాంగ్రెస్, టీడీపీల నుంచి గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరినవారు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారు.

2018లో ఏడుగురు సిట్టింగ్ లకు కేసీఆర్ టికెట్లు నిరాకరించారు. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ నుంచి 12 మంది, టీడీపీ నుంచి ఇద్దరితోపాటు మరో స్వతంత్ర ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మళ్లీ టికెట్‌ ఇస్తామని కేసీఆర్‌ భరోసా ఇచ్చినా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వారిలో ఒకరిద్దరికి టికెట్‌ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని సమాచారం.

నిజంనిప్పులాంటిది

Aug 18 2023, 10:30

వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్ !

- కొనసాగుతున్న తీవ్ర ఉత్కంఠ

- నేతల మధ్య వాగ్వాదం

వైఎస్ఆర్‌‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను శుక్రవారంనాడు పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇవాళ గజ్వేల్ పర్యటనకు వెళ్తానని షర్మిల ప్రకటించారు. దరిమిలా పోలీసులు ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు.

దళిత బంధు పథకంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణల విషయమై తనకు స్థానికుల నుండి ఆహ్వానం రావడంతో గజ్వేల్ టూర్ కు వెళ్లనున్నట్టుగా వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల నిన్న ప్రకటించారు.

గజ్వేల్ నియోజకవర్గంలోని తీగుల్ గ్రామస్తులు షర్మిలకు ఈ మేరకు వినతి పత్రం పంపారు. దీంతో తీగుల్ గ్రామానికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే షర్మిల గజ్వేల్ టూర్ నేపథ్యంలో పోలీసలు ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే షర్మిల గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటిస్తే అడ్డుకుంటామని స్థానిక బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. తీగుల్ గ్రామంలో దళితబంధు పథకంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని స్థానికుల నుండి వినతి మేరకు తాను తీగుల్ కు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నానని షర్మిల పోలీసులకు సమాచారం పంపారు.

తన టూర్ కు సంబంధించి బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటారని వార్నింగ్ ఇవ్వడంతో షర్మిల పోలీసులకు సమాచారం పంపారు. తన టూర్ కు భద్రత కల్పించాలని కోరారు.

వైఎస్ షర్మిల గజ్వేల్ పర్యటిస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని పోలీసులు భావించారు. దీంతో హైద్రాబాద్ లోటస్ పాండ్ లోనే ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు.

నిజంనిప్పులాంటిది

Aug 18 2023, 10:27

బాధిత మహిళకు న్యాయం జరిగేలా చూస్తాం: మంత్రి సత్యవతి రాథోడ్

నందిహిల్స్‌ కాలనీలో నివాసముంటున్న వరలక్ష్మీపై ఎల్బీనగర్‌ పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం దారుణమని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు.

మీర్‌పేట్‌ పీఎస్‌ పరిధిలో అర్ధరాత్రి మహిళను స్టేషన్‌కు తీసుకెళ్లి థర్డ్‌డిగ్రీకి ప్రయోగించిన ఘటనపై గురువారం సాయంత్రం మంత్రి స్పందించారు.

విషయం తెలిసిన వెంటనే మంత్రి స్వయంగా రాచకొండ సీపీకి ఫోన్‌ చేసి ఘటనపై ఆరా తీశారు.

మహిళపై దాడికి పాల్పడ్డ బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మంత్రి ఆదేశించారు.

సమగ్ర విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని పోలీసు అధికారులకు మంత్రి ఆదేశించారు...

నిజంనిప్పులాంటిది

Aug 18 2023, 10:24

కారెక్కెందుకు జగ్గారెడ్డి : సిద్ధమా ❓️

కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ ల మీద షాకులు తగులుతున్నాయి. ఒక వైపు బీజేపీ, బీఆర్‌ఎస్‌ నుంచి చేరికలు ఉంటున్నాయని కాంగ్రెస్‌ నేతలు చెబుతుండగా, మరో వైపు సొంత పార్టీ నుంచి మరి కొందరు సీనియర్‌ నాయకులు జంప్‌ చేస్తున్నారు.

పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు.

రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్‌ నుంచి ఇప్పటికే క్లియరెన్స్‌ వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే టికెట్‌ ఆయనకే ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరిందనే ప్రచారం జరుగుతోంది.

జగ్గారెడ్డి కూడా తన నియోజక వర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు కూడా పార్టీ మారుతున్న అంశాన్ని స్పష్టం చేశారని తెలిసింది. తనపై అభిమానం ఉన్నవారు రావచ్చని, తాను మాత్రం ఒత్తడి చేయనని పార్టీ కేడర్‌కు చెప్పినట్లుగా తెలిసింది.

అంతే కాకుండా ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అనుచరుడు తెల్లం వెంకట్రావ్‌ గురువారం కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే.

కాగా, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో జగ్గారెడ్డికి మొదటి నుంచి పొసగడం లేదు. పార్టీ కార్యక్రమాల నిర్ణయం, అమలు విషయంలో రేవంత్‌రెడ్డి పార్టీ సీనియర్లను ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదని, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని జగ్గారెడ్డి పలుమార్లు బహటంగానే విమర్శలు చేశారు....